BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

దళిత సాధికారతకు CDS కీలక వేదిక

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
04 Apr, 2026 - 08:36 PM
94 వీక్షణలు

దళిత సాధికారతకు CDS కీలక వేదిక

రూ.15 కోట్ల ఎండోమెంట్‌కు ప్రతిపాదనలు – సానుకూలంగా స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : బొరబండలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (CDS) దళితుల సమగ్ర అభివృద్ధికి ముఖ్య వేదికగా నిలుస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో కలిసి CDSను సందర్శించి, కేంద్రంలోని సదుపాయాలు, కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా CDS చైర్‌పర్సన్ మల్లెపల్లి లక్ష్మయ్య కేంద్ర భవన నిర్మాణం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరించారు. పార్కింగ్ సౌకర్యాలు, కామన్ హాల్, డైనింగ్ హాల్, పరిపాలన కార్యాలయాలు, ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ మరియు ఫిజికల్ లైబ్రరీలు, మీడియా రూములు, శిక్షణార్థుల వసతి గదులు, అత్యాధునిక ఆడిటోరియం, దళిత్ మ్యూజియం వంటి విభాగాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.

గత 26 సంవత్సరాలుగా దళితులు, వెనుకబడిన వర్గాల సాధికారత కోసం CDS చేపట్టిన పరిశోధనలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, విధాన సూచనలపై లక్ష్మయ్య వివరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్ లింబాద్రి, సీనియర్ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, తిప్పర్తి యాదయ్య తదితరులు కూడా కేంద్ర కార్యకలాపాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన పలు కీలక కార్యక్రమాలపై ప్రతిపాదనలు మంత్రికి సమర్పించారు. ముఖ్యంగా దళిత యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన, UPSC, TGPSC వంటి పోటీ పరీక్షలకు కోచింగ్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల పర్యవేక్షణ, భూహక్కుల పరిరక్షణ, సామాజిక-ఆర్థిక పరిశోధనలు, మహిళలు, యువతకు నాయకత్వాభివృద్ధి కార్యక్రమాలు, దళిత్ మ్యూజియం అభివృద్ధి, దళిత సాహిత్య డిజిటలైజేషన్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడ్వాన్స్‌డ్ ఆర్కైవ్స్ స్థాపన వంటి అంశాలను ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాల అమలుకు రూ.15 కోట్ల ఎండోమెంట్ ఫండ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ CDS పనితీరును ప్రశంసిస్తూ, “దళిత సాధికారతకు ఇది ఒక సమగ్ర వేదిక. ఇక్కడి మౌలిక వసతులు, పరిశోధనా సామర్థ్యం ప్రభుత్వానికి కూడా ఉపయోగపడగలవు” అని పేర్కొన్నారు. సమర్పించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, వ్యక్తిగతంగా చొరవ తీసుకుని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.