www.ntodaynews.com
దొంతపూర్ శ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ
/
జగిత్యాల
దొంతపూర్ శ్రీ సీతారామ కళ్యాణంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన కళ్యాణ వేడుకల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి స్వామివారి కల్యాణాన్ని వీక్షించి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికి, కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.