BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

డోర్ టు డోర్ సేల్స్‌మన్ నుంచి కోట్లా విలాసాల అధిపతికి – కేకే ప‌టేల్ విజయం ప్రేరణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 09:15 PM
13 వీక్షణలు

అత‌ను ఒకప్పుడు డోర్ టు డోర్ సేల్స్‌మన్. ఇప్పుడు వేల కోట్ల టర్నోవర్ ఉన్న నిర్మా కంపెనీకి అధిపతి. “నిర్మా… నిర్మా… వాషింగ్ పౌడర్ నిర్మా…” అంటూ అప్పటి యాడ్ గుర్తుండి వెళ్లదు. ఆ యాడ్ అప్పట్లో సంచలనంగా మారింది. విదేశీ బ్రాండ్ల సర్ఫ్ పౌడర్‌లను తాకకుండా, దేశీయ బ్రాండ్ అయిన నిర్మా డిటర్జెంట్ పౌడర్ మార్కెట్‌లో అగ్రస్థానానికి చేరింది.

ఈ విజయం వెనుక ఒక వ్య‌క్తి కృషి ఉందని మర్చకరాదు. ఆయన ఎవరో అంటే… డాక్టర్ కార్సన్‌భాయ్ ఖోదిదాస్ ప‌టేల్, పట్లేల్ అని చలించగా పిలుస్తారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించిన పటేల్, 21 సంవత్సరాల వయసులో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. చిన్నప్పుడు నుంచి వ్యాపారంలో విజయాన్ని సాధించాలనే కోరిక ఆయనకు ఉంది.

పటేల్ తన ఇంటి వెనకే డిటర్జెంట్ పౌడర్ తయారుచేశారు. అవసరమైన డబ్బు అహ్మదాబాద్‌లోని టెక్స్టైల్ మిల్‌లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేస్తూ సంపాదించారు. తాము తయారుచేసిన పౌడర్‌ను ఇల్లులలో తిరిగి అమ్మడం ప్రారంభించారు. తక్కువ ధర, అధిక క్వాలిటీ కారణంగా పౌడర్ ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. 1969లో, విదేశీ బ్రాండ్లు కేజీకి రూ.13కి అమ్మేవి, కానీ పటేల్ కేవలం రూ.3కే, మరింత క్వాలిటీతో అందించారు.

పటేల్ కూతురు నిరుపం ఒక యాక్సిడెంట్‌లో మృతి చెందింది. ఆమె స్మృతికి ఆయన ఆ పౌడర్‌కి “నిర్మా” అని పేరు పెట్టారు. పౌడర్ విజయం సాధించింది.

తర్వాత, నిర్మా గ్రూప్ కింద పటేల్ అనేక ఉత్పత్తులను తక్కువ ధర, అధిక క్వాలిటీతో అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లారు. నిర్మా టాయిలెట్ సొప్‌ల లోక్స్‌, లైఫ్ బాయ్ తదితర సబ్బులు, అత్యధిక అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి.

కేవలం వ్యాపారం మాత్రమే కాదు, పటేల్ విద్యారంగంలో కూడా అడుగు పెట్టారు. 1995లో నిర్మా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 2004లో నిర్మా ల్యాబ్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ స్థాపించారు. 2009లో ఫోర్బ్స్ మ్యాగజైన్ దేశంలోనే 92వ స్థానంలో కోటీశ్వరుడిగా గుర్తించారు. 2010లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది.

డోర్ టు డోర్ సేల్స్‌మన్‌గా మొదలై, దేశంలోనే అత్యున్నత స్థాయి వ్యాపారిగా ఎదిగిన కేకే పటేల్ జీవితం, యువ ఔత్సాహికులకు ప్రేరణ కావాల్సిన స్ఫూర్తిదాయక కథ.