BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
16 May, 2026 - 07:30 PM
129 వీక్షణలు

పలువురిని అరెస్టు చేసిన రామన్నపేట పోలీసులు

మార్కెట్లలో నెలలు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నాకు బయలుదేరిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ ఎడ్ల మహాలింగంలను పోలీసులు రామన్నపేటలో అరెస్ట్ చేశారు. రైతు సంఘాల పిలుపుమేరకు పెద్ద తుమ్మలగూడెం రైతులతో కలిసి భువనగిరి బయలుదేరుతుండగా, పోలీసులు ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి మరీ తమను బలవంతంగా పీఎస్‌కు తరలించారని, సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారని వారు మండిపడ్డారు. రౌడీలను, గూండాలను అరెస్ట్ చేసినట్లుగా రైతుల కోసం పోరాడే వారిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ​ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రామన్నపేట మార్కెట్లలో ధాన్యం పోసి రెండు నెలలవుతున్నా కొనేనాథుడు లేక, వర్షాలకు తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే, ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను పక్కనబెట్టి రైతులను అరిగోస పెడుతున్నారని ధ్వజమెత్తారు. మార్కెట్లలోని ధాన్యాన్ని వెంటనే ఎలాంటి తరుగు  లేకుండా కొనుగోలు చేయాలి అని.  ​లారీలు, హమాలీలను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలి అని తెలిపారు క్వింటాలుకు ఐదారు కిలోలు కట్ చేస్తున్న రైస్ మిల్లులను సీజ్ చేయాలి. అని ​కాంటా వేసిన 24 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ​తమ సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్తారని వారు హెచ్చరించారు..