ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం – బిజెపి ఆగ్రహం
హాజీపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే ఎదురుచూడాల్సి వస్తోందని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కాశెట్టి నాగేశ్వరరావు, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల నియోజకవర్గంలో నిలిచిపోయిన ధాన్యం లారీలను వెంటనే తరలించాలని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో స్పందించి రైతులకు న్యాయం చేయాలని పోలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యం కోరారు. సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు