BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం – బిజెపి ఆగ్రహం

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 Apr, 2026 - 04:26 PM
117 వీక్షణలు

హాజీపూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న జాప్యంపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం మరియు అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల రోజులుగా రైతులు ధాన్యం కుప్పల వద్దే ఎదురుచూడాల్సి వస్తోందని బిజెపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కాశెట్టి నాగేశ్వరరావు, తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. రైస్ మిల్లర్ల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

​మంచిర్యాల నియోజకవర్గంలో నిలిచిపోయిన ధాన్యం లారీలను వెంటనే తరలించాలని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో స్పందించి రైతులకు న్యాయం చేయాలని పోలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యం కోరారు. సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు