BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై దాడి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:36 PM
118 వీక్షణలు

దేశ రాజధాని ఢిల్లీలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై డ్రైవర్‌, కండక్టర్ కలిసి దారుణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 12 రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బాధిత మహిళ సరస్వతీ విహార్ బస్టాండ్ వద్ద వేచి ఉండగా, అక్కడికి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులోకి డ్రైవర్‌, కండక్టర్ బలవంతంగా లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. అనంతరం కదులుతున్న బస్సులోనే ఆమెపై దాడి చేసి, రాత్రంతా చిత్రహింసలకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వివరాలు, నిఘా దృశ్యాల ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనతో దేశవ్యాప్తంగా మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జరిగిన నిర్భయ ఘటనను తలపించేలా ఈ సంఘటన ఉండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.