www.ntodaynews.com
ధర్మారం రామాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు
తెలంగాణ
/
పెద్దపల్లి
ధర్మారం రామాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు
ధర్మారం: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండల కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం సీతారామ కల్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ సీతారాముల కృపతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.