BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

ధర్మపురి బాలుర ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Jul, 2026 - 06:06 PM
42 వీక్షణలు

ధర్మపురి బాలుర ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

​ధర్మపురి, ముచ్చట్లు:

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు స్వయంగా మాత్రలను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల్లో నులిపురుగుల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసమే ఈ మాత్రలను పంపిణీ చేస్తున్నామని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రలను తీసుకోవాలని ఆమె సూచించారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ సంఘనబట్ల దినేష్, డాక్టర్ శివకుమారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.