ధర్మపురి బాలుర ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
ధర్మపురి బాలుర ఉన్నత పాఠశాలలో నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ
ధర్మపురి, ముచ్చట్లు:
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ధర్మపురి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు స్వయంగా మాత్రలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల్లో నులిపురుగుల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసమే ఈ మాత్రలను పంపిణీ చేస్తున్నామని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు విద్యార్థులందరూ తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్రలను తీసుకోవాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ సంఘనబట్ల దినేష్, డాక్టర్ శివకుమారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.