BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిలిచిన ఎక్స్‌రే సేవలు: రోగుల తీవ్ర అవస్థలు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
13 Jul, 2026 - 03:24 PM
49 వీక్షణలు

​మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు వరుసగా చెడిపోతుండటంతో పేద రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదట ప్రధాన ఆసుపత్రిలోని ఎక్స్‌రే మిషన్ పనిచేయకపోవడంతో, ప్రత్యామ్నాయంగా రోగులను మాతా-శిశు సంరక్షణ ఆసుపత్రికి (MCH) తరలించి సేవలు అందించారు. అయితే తాజాగా అక్కడ ఉన్న ఎక్స్‌రే యంత్రం కూడా సాంకేతిక లోపంతో పూర్తిగా మొరాయించడంతో ప్రభుత్వ వైద్య సేవలు మరింత కుంటుపడ్డాయి.

​ప్రస్తుతం రెండు ఆసుపత్రుల్లోనూ సేవలు నిలిచిపోవడంతో అధికారులు రోగులను టీ-హబ్ (T-Hub) కేంద్రానికి తరలించి ఎక్స్‌రేలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాల బారిన పడి అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు, గర్భిణులు, వృద్ధులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లలో వేల రూపాయలు ఖర్చు చేయలేని పేద రోగుల పరిస్థితి దయనీయంగా మారిందని, అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న ఎక్స్‌రే యంత్రాలకు మరమ్మతులు చేపట్టి సాధారణ సేవలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు