BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

ఊటుకూరులో రూ.95 లక్షలతో ఏసీ కళ్యాణ మండపం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 06:04 PM
135 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ సహకారంతో రూ.95 లక్షల వ్యయంతో నిర్మించిన ఏసీ కళ్యాణ మండపాన్ని సోమవారం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, సహకార సంఘ చైర్‌పర్సన్ చెరుకూరి రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థలదాత కీర్తిశేషులు జొన్నలగడ్డ శంకరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం రూ.40 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న వడ్డెర కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో జరిగిన సభలో చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు లభించే ప్రయోజనాలను వివరించారు. అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో తిరువూరు ఏఎంసీ చైర్‌పర్సన్ రేగళ్ల లక్ష్మీ అనిత–వీరారెడ్డి దంపతులు, మాజీ మండల అధ్యక్షుడు యనమద్ది పుల్లయ్య చౌదరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవభక్తుని సీతారాం ప్రసాద్, మాజీ సర్పంచులు చావా నిర్మల, కోట పుల్లమ్మ, టీడీపీ నాయకులు దిరిశాల వెంకట కృష్ణారావు, కందిమళ్ల శేషగిరిరావు, మానుకొండ రామకృష్ణ, దుబ్బాకు వెంకటేశ్వర్లు, సీపీఎం నాయకుడు నందిగామ జనార్ధన చారి, జనసేన నాయకుడు చింతలపాటి వెంకటకృష్ణ, బ్యాంకు చీఫ్ మేనేజర్ తెనాలి శ్రీనివాసరావు, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, వివిధ గ్రామాల సహకార సంఘాల ఉద్యోగులు, చైర్‌పర్సన్లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.