www.ntodaynews.com
మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్స్పె
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా - మదనపల్లి
అన్నమయ్య జిల్లా *ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,.* గారిని మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.
రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఏ. చాంద్ బాషా, జిల్లా సైబర్ క్రైమ్ మరియు సోషల్ మీడియా సీఐగా ఎన్. శేఖర్ విధుల్లో చేరారు.
నూతన అధికారులు ఎస్పీ గారికి పుష్పగుచ్ఛాలకు బదులుగా పర్యావరణ హితంగా పూల మొక్కలను అందజేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు.
రాయచోటిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, జిల్లాలో సైబర్ నేరాలు మరియు అసత్య ప్రచారాల కట్టడిపై ఎస్పీ గారు వారికి దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచాలని ఎస్పీ గారు సూచించారు.