BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

మంత్రి చొరవతో పోలిమేర రహదారి పనులకు ఊరట.. రైతుల హర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 06:04 PM
676 వీక్షణలు

చాట్రాయి–విసన్నపేట మండలాల మధ్య ఉన్న పోలిమేర రహదారి నిర్మాణ పనులు కంకర కొరతతో నిలిచిపోయిన నేపథ్యంలో శనివారం రాత్రి నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని కలిసి సమస్యను వివరించారు.

సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి తిరువూరు నియోజకవర్గ అధికారులతో మాట్లాడి, విసన్నపేట మండల పరిధిలోని కొత్తచెరువు నుంచి రహదారి నిర్మాణానికి అవసరమైన కంకర తరలించేందుకు అనుమతులు ఇప్పించారు. దీంతో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఈ సందర్భంగా రైతులు మంత్రి కొలుసు పార్థసారధికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సరైన దారి లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సొంత నిధులతో రహదారి నిర్మాణం చేపట్టినా మధ్యలో పనులు నిలిచిపోవడంతో నిరాశకు గురయ్యామని తెలిపారు. మంత్రి చొరవతో సమస్య పరిష్కారం కావడంతో రహదారి నిర్మాణం పూర్తవుతుందనే ఆశ కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, రైతులు దార్ల వెంకటేశ్వరరావు, బూబత్తుల రాము, బూబత్తుల ప్రసాద్, మిద్దె చెన్నారావు, బూబత్తుల లక్ష్మణరావు, చీపి చంటి, నక్కా చెన్నారావు, దార్ల సర్వేశ్వరరావు పాల్గొన్నారు.