BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

మంత్రి చొరవతో పోలిమేర రహదారి పనులకు ఊరట.. రైతుల హర్షం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jul, 2026 - 06:04 PM
37 వీక్షణలు

చాట్రాయి–విసన్నపేట మండలాల మధ్య ఉన్న పోలిమేర రహదారి నిర్మాణ పనులు కంకర కొరతతో నిలిచిపోయిన నేపథ్యంలో శనివారం రాత్రి నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార–ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని కలిసి సమస్యను వివరించారు.

సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి తిరువూరు నియోజకవర్గ అధికారులతో మాట్లాడి, విసన్నపేట మండల పరిధిలోని కొత్తచెరువు నుంచి రహదారి నిర్మాణానికి అవసరమైన కంకర తరలించేందుకు అనుమతులు ఇప్పించారు. దీంతో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఈ సందర్భంగా రైతులు మంత్రి కొలుసు పార్థసారధికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 300 ఎకరాల ఆయకట్టుకు సరైన దారి లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సొంత నిధులతో రహదారి నిర్మాణం చేపట్టినా మధ్యలో పనులు నిలిచిపోవడంతో నిరాశకు గురయ్యామని తెలిపారు. మంత్రి చొరవతో సమస్య పరిష్కారం కావడంతో రహదారి నిర్మాణం పూర్తవుతుందనే ఆశ కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, రైతులు దార్ల వెంకటేశ్వరరావు, బూబత్తుల రాము, బూబత్తుల ప్రసాద్, మిద్దె చెన్నారావు, బూబత్తుల లక్ష్మణరావు, చీపి చంటి, నక్కా చెన్నారావు, దార్ల సర్వేశ్వరరావు పాల్గొన్నారు.