www.ntodaynews.com
భాగల్కోట్లో ధర్మప్రచార కార్యక్రమం
తెలంగాణ
భాగల్కోట్లో ధర్మప్రచార కార్యక్రమం నిర్వహించిన శ్రీశైల దేవస్థానం
NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం భాగల్కోట్ జిల్లా తేర్దాళ్లోని అల్లమప్రభు దేవస్థానంలో ధర్మప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించబడింది.
ధర్మప్రచారంలో భాగంగా ఉదయం ధర్మప్రచార రథం ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. అర్చకులు రథంలోని స్వామి–అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది.
సాయంత్రం కల్యాణోత్సవం
సాయంత్రం అల్లమప్రభు దేవస్థానం ప్రాంగణంలో స్వామి–అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో భాగంగా:
లోకకల్యాణాన్ని కోరుతూ సంకల్ప పఠనం
గణపతి పూజ
పుణ్యాహవచనం
కంకణపూజ, యజ్ఞోపవీత పూజ
సప్త ఋషుల ప్రార్థన, కన్యావరణ మంత్రాలు
వరపూజ, ప్రవర పఠనం
మధుపర్క సమర్పణ
వస్ర్త సమర్పణ, బాషికధారణ
గౌరీపూజ, మహాసంకల్పం
జీలకర్ర–బెల్లం సమర్పణ
మాంగల్యధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలు
కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనం అందజేయబడుతుంది.
ఈ కార్యక్రమం కార్యనిర్వహణాధికారివారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం ద్వారా నిర్వహించబడింది.
#Srisailam #DharmaPracharam #Bhagalkot #Karnataka #TempleNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube