BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారా?

తెలంగాణ
07 Feb, 2026 - 08:09 AM
231 వీక్షణలు
అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారా? బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవీ కాలంలో ఎప్పుడైనా పూలమాల వేసి గౌరవించారా అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయం, చావటి వద్ద నిర్వహించిన కార్నర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజ్యాంగంపై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలు “దయ్యాలు వేదాలు వల్లించినట్లు” ఉన్నాయని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరించి పార్టీలో చేర్చుకున్న చరిత్ర ఉన్న పార్టీ నుంచి గెలిచిన వ్యక్తికి రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. మెట్‌పల్లి అభివృద్ధిపై కీలక హామీలు మంత్రి తన ప్రసంగంలో మెట్‌పల్లి పట్టణ అభివృద్ధిపై పలు హామీలు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం పట్టణంలోనే ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరిస్తానని తెలిపారు. ఎస్సారెస్పీ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు త్వరలోనే పట్టాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో కొత్త రేషన్ దుకాణాలను మంజూరు చేస్తామని తెలిపారు. మెట్‌పల్లి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవసరమని, అప్పుడే పట్టణానికి ప్రాధాన్యంగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Metpally #Ambedkar #CongressParty #MunicipalElections #TelanganaPolitics #UrbanDevelopment Follow us on Website Facebook Instagram YouTube