www.ntodaynews.com
రేషన్ షాపులపై మంత్రి మనోహర్తో చర్చ
తెలంగాణ
పుంగనూరు నియోజకవర్గ రేషన్ షాపులపై మంత్రి మనోహర్తో చర్చ
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు రిపోర్టర్
పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జి సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్), విజయవాడ ఆటోనగర్లోని రాష్ట్ర ఆహార భద్రతా భవనంలో జనసేన పార్టీ PAC చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్తో కలిసి పుంగనూరు నియోజకవర్గంలోని రేషన్ షాపుల అంశంపై చర్చించారు. కొత్తగా మంజూరుకానున్న రేషన్ షాపులను కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి చెందిన నాయకులకు కేటాయించాలని మంత్రిని కోరారు.
అలాగే జిల్లా విభజన సమయంలో మంత్రివర్గ కమిటీలో కీలక పాత్ర పోషించి, అన్నమయ్య జిల్లాను మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు మంత్రి మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా నియోజకవర్గ ఇన్చార్జులు పీలేరు ఇన్చార్జి బెజవాడ దినేష్, తంబళ్లపల్లె ఇన్చార్జి పోతుల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
#Punganur
#AnnamayyaDistrict
#JanaSenaParty
#CivilSupplies
#RationShops
#NadellaManohar
#SiriveluGangadhar
#AlliancePolitics
#AndhraPradeshPolitics
#NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube