BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
29 Nov, 2025 - 05:52 AM
91 వీక్షణలు

పల్లె దవాఖాన లో విధులకు హాజరుకాని ఎంఎల్ హెచ్ పి శ్రావణి కి షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్

NTODAY NEWS:బొమ్మలరామారం మండలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలని, తదనుగుణంగా గర్భిణులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.శనివారం రోజున బొమ్మలరామారం మండలం, మర్యాల పల్లె దవాఖానని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.ఆకస్మిక తనిఖీ లో బాగంగా విధులకు హాజరు కానీ ఎమ్.ఎల్.ఎచ్.పి శ్రావణి కు షోకాజ్ నోటీస్ జారీ చేసిన జిల్లా కలెక్టర్.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పల్లె దవాఖానలో సిబ్బంది రెగ్యులర్ గా విధులకు వస్తున్నారా లేదా అని ఆరా తీసి ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరు కానీ ఎమ్.ఎల్.ఎచ్.పి శ్రావణి కి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సిబ్బంది అందరూ అందుబాటు లో ఉండి వివిధ రకాల సమస్యలు పై ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలందించాలన్నారు. ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయా అని ఏ.ఎన్.ఎంలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.పల్లె దవాఖానలో ఎంత మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని అడిగి రెగ్యులర్ గా చెకప్ కు వస్తున్నారా లేదా చూసుకోవాలని ఆశ వర్క్ లకు తెలిపారు. ఈ నెలలో ఏమైనా డెలివరీలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు.

అనంతరం మర్యాల గ్రామంలో పశు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..మొత్తం ఎంత మంది సిబ్బంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు.రోజు ఆసుపత్రికి పశువులను తీసుకొని ఎంత మంది వస్తున్నారని ఆరా తీశారు.టీకాలు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకొని,ప్రతి మూగ జీవాలకు గ్రామ గ్రామాన సమయానికి టీకాలు వేయాలన్నారు.

అనంతరం మర్యాల గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ... ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు పూర్తి చేశారని అడిగి తెలుసుకున్నారు. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం ఎంత ఉందని అడిగి తెలుసుకున్నారు.ఎన్ని రోజుల్లో కొనుగోలు పూర్తి అవుతుందని అడిగి తెలుసుకోని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రానికి సరిపోను లారీలు వస్తున్నాయా అని అడిగారు. కేంద్రంలో సరిపోను గన్ని బ్యాగ్ లు ఉన్నాయా అని అడిగి లారీలలో లోడ్ చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube