BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

తెలంగాణ
02 Mar, 2026 - 04:23 AM
192 వీక్షణలు
ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ పెండింగ్‌పై శాఖల వారీ ప్రత్యేక సమీక్షకు ఆదేశాలు హన్మకొండ, మార్చి 02: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె స్వయంగా ప్రజల నుండి వినతులు స్వీకరించారు. క్షేత్రస్థాయి విచారణకు ప్రాధాన్యం ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి తక్షణ న్యాయం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్య పరిష్కారంలో ఆలస్యం అసహ్యకరమని పేర్కొన్నారు. పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక సమీక్ష పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ఇకపై శాఖల వారీగా సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఏ ఒక్క దరఖాస్తు కూడా అనవసరంగా పెండింగ్‌లో ఉండకూడదని, గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. “ప్రజలు ఎన్నో ఆశలతో ప్రజావాణికి వస్తారు. వారి సమస్యలను మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది” అని కలెక్టర్ పేర్కొన్నారు. 345 దరఖాస్తులు స్వీకరణ ఈ సోమవారం జరిగిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు హాజరయ్యారు. మొత్తం 345 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించిన వినతులు అధికంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు. #Prajavani #Hanamkonda #DistrictCollector #PublicGrievances #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube