BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యుత్, నీటి సమస్యను పరిష్కరించిన మున్సిపల్ చైర్‌పర్సన్ పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత..
www.ntodaynews.com

లోక్‌సభ ముందుకు గురువారం డీలిమిటేషన్ బిల్లు కేంద్రం వైఖరిపై ఉత్కంఠ!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Apr, 2026 - 07:12 AM
59 వీక్షణలు

ఈరోజు లోక్‌సభ ముందుకు డీలిమిటేషన్ బిల్లు  కేంద్రం వైఖరిపై ఉత్కంఠ!

మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026 తీసుకొస్తున్న కేంద్రం

లోక్‌సభలో మహిళల కోసం 33% రిజర్వేషన్లను అమలు చేసేందుకు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనుంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ ఈ బిల్లును సభలో సమర్పించనున్నారు. అనంతరం ఈ బిల్లుపై చర్చ జరగనుంది.

ఈ బిల్లు ప్రకారం, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కు పెంచాలని ప్రతిపాదించబడింది. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాల నుంచి, 35 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉంటాయి. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 సవరణకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 530 స్థానాల పరిమితిని పెంచడం, కొత్తగా 850 స్థానాల సవరింపుని ప్రతిపాదించడం కీలకంగా కనిపిస్తోంది.

మహిళా రిజర్వేషన్ల పై కీలక నిర్ణయాలు

2029 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అందించేందుకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (2026) తీసుకొస్తున్న కేంద్రం, 2026 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టే దిశగా ఆర్టికల్ 81(3)లో సవరణలు ప్రతిపాదించింది.

ఇప్పటికీ, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా లేదా 2011 లెక్కల ఆధారంగా ఇది జరగడం, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

డీలిమిటేషన్ కమిషన్

మహిళా రిజర్వేషన్లకు అనుగుణంగా, దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పునర్విభజన కోసం సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. బిల్లు చట్టరూపం దాల్చిన తరువాత, ఈ కమిషన్ పనిలో పడుతుంది.

ఈ కమిషన్ క్రింద, రాష్ట్రాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన 10 మంది సభ్యులు, సుప్రీం కోర్టు నియమించే ఛైర్‌పర్సన్, కేంద్ర ఎన్నికల కమిషనర్, మరియు రాష్ట్ర ఎన్నికల అధికారులు సభ్యులుగా ఉంటారు.

ఇటువంటి పార్లమెంటు, అసెంబ్లీల పునర్విభజనలో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతాన్ని కూడా పరిగణనలో తీసుకుంటారు.