BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​ఎల్.పి.జి. వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
18 Jun, 2026 - 08:27 PM
250 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం కింద వంటగ్యాస్ రాయితీని నిరంతరంగా పొందేందుకు వినియోగదారులు తమ బ్యాంకు ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఒక ప్రకటనలో కోరారు. చమురు మార్కెటింగ్ సంస్థలతో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసే ప్రక్రియ జిల్లాలో చురుగ్గా కొనసాగుతోందని, ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు ఈ నెల 30వ తేదీ లోపు తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

​నిర్ణీత గడువు ముగిసేలోగా ఆధార్‌తో బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయని వినియోగదారులకు వంటగ్యాస్ రాయితీ జమ కావడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు. అయితే, రాయితీ జమలో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆధార్ అనుసంధానంతో సంబంధం లేకుండా వంటగ్యాస్ సరఫరా సేవలు మాత్రం యథావిధిగానే కొనసాగుతాయని వినియోగదారులు గమనించాలని ఆయన వివరించారు.

​రేషన్ కార్డుదారులు ఈ - కె వై సి పూర్తి చేయాలి

​ఇదే క్రమంలో జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలనే ఉద్దేశ్యంతో, నకిలీ కార్డులను నిరోధించి రికార్డులను నవీకరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయించుకోని వారు, రేషన్ కార్డులోని సభ్యులందరూ వెంటనే తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి, అక్కడి యంత్రాల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు