BREAKING
అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన ఏపీకి వర్ష సూచన.. 5 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సిరిపురంలో మెయిన్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలి.. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వినతిపత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం.. తల్లి, నవజాత శిశువు మృతి అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఎన్‌సీఎస్‌సీ నోటీసులు Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట! బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు
www.ntodaynews.com

MPL పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని తహసిల్దార్‌కు వినతి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
18 Jun, 2026 - 03:03 PM
227 వీక్షణలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వట్టిమర్తి శివారులో ఉన్న ఎం.పి.ఎల్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న భారీ కాలుష్యం, నల్లని పొగ, బూడిద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం చిట్యాల తహసీల్దార్ విజయ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్య ప్రభావంతో చిట్యాల మున్సిపాలిటీతో పాటు వట్టిమర్తి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి పూర్తిగా కలుషితమవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమ కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పరిశ్రమ యాజమాన్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ వినతిపత్రం సమర్పణ కార్యక్రమంలో మున్సిపల్ సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, 10వ వార్డు కౌన్సిలర్ నిమ్మలగోటి శ్రీనివాస్, 2వ వార్డు కౌన్సిలర్ ఎస్కే షబానా అజీముద్దీన్, 9వ వార్డు బీఆర్ఎస్ ఇంచార్జ్ ఆగు అశోక్ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.