ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
నూజివీడు నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు, ఎండాకాలంలో ఉపాధి హామీ కూలీల ఆరోగ్యం దెబ్బతినకుండా, వారు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం ఉదయం, చిన్నచెరువు దగ్గర పని చేసే కూలీలతో మోరంపూడి వారితో మాట్లాడి, వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ తాతయ్య బాబుకు, కూలీలకు కావలసిన సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. అలాగే, చనుబండ చిన్న చెరువులో పనిచేస్తున్న కూలీలకు శీతల పానీయాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వెల్లంకి నాగ మహేశ్వర రావు, ఫీల్డ్ అసిస్టెంట్ తాతయ్య బాబు, విస్సంపల్లి ప్రసాద్, కళ్లేపల్లి మారేశ్వర రావు, విస్సంపల్లి చంద్రం, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.