BREAKING
సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం
www.ntodaynews.com

ఎంపీ వంశీకి బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదు: నగునూరి వెంకటేశ్వర గౌడ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 06:07 PM
74 వీక్షణలు
పెద్దపల్లి ఎంపీ వ్యాఖ్యలపై మంచిర్యాలలో బిజెపి వినూత్న నిరసన

​బిజెపి నాయకులు రఘునాథ్ వెర్రబెల్లి, పార్టీ కార్యకర్తలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన పరుష వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిసరాల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ చిత్రపటాన్ని ప్రజలకు చూపిస్తూ ‘ఈయనను గుర్తించారా’ అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. అనంతరం వెంకటేశ్వర గౌడ్ మాట్లాడుతూ.. తాత, తండ్రుల వారసత్వంతో, వందల కోట్లు ఖర్చు పెట్టి ఎంపీ అయిన వంశీకి.. దేశం కోసం, పార్టీ కోసం పస్తులుండి కష్టపడే బిజెపి కార్యకర్తలను విమర్శించే నైతిక స్థాయి లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

​కొన్ని సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ ఎదుట ముసుగేసి ఉన్న సొంత తాత, దివంగత వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించుకోలేని తండ్రీకొడుకులు.. కేంద్ర నిధులపై అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సొంత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అధికారులు తనకు ప్రోటోకాల్ ఇవ్వడం లేదని బాధపడే ఏకైక ఎంపీ వంశీ అని, బయట మాత్రం తానే గొప్పగా నిధులు తెచ్చానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటన్నారు. మంచిర్యాలలో ఒక ‘కేరళ ఎక్స్‌ప్రెస్’ స్టాపేజ్ కూడా ఇప్పించలేని వారు కేంద్ర నిధులు తెచ్చామనటం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, నాయకులు ఎనగందుల కృష్ణమూర్తి, జోనల్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు, కుర్రి చక్రవర్తి, సత్రం రమేష్, కౌన్సిలర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత సత్యనారాయణతో పాటు బిజెపి జిల్లా, మంచిర్యాల కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు