ఎన్ని నిరసనలు చేసినా పట్టించుకోని అధికారులు
ఎన్ని నిరసనలు చేసినా పట్టించుకోని అధికారులు, మర్యాల రోడ్డు ఇప్పట్లో పూర్తి అయ్యేనా
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి నుంచి భువనగిరి మండలం వడపర్తి వరకు నిలిచిన రోడ్డు పనులు పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఎ ఐ, సిపిఐ (ఎం) సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని మర్యాల రోడ్డుపై ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఎన్నికల ముందు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తనను గెలిస్తే సంవత్సరంలోపు డబల్ రోడ్డు వేయిస్తానని ఇచ్చిన హామీని.. కాంట్రాక్టర్ ఆ హామీని తుంగలో తొక్కేశాడు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య 2024 మార్చి 15 నాడు భువనగిరి మండలం వడపర్తి జాతీయ రహదారి నుండి వయ మర్యాల మీదుగా దేవుని తండా వరకు 8 కి మీ.. మొదటి టెండర్, దేవుని తండా నుండి చీకటిమామిడి గ్రామం వరకు మరో 3 కి. మీ వరకు రెండో టెండర్ కింద 18కోట్ల మంజూరు చేయించి శంకుస్థాపన చేశారు. చుట్టుపక్కల ప్రజలుపరిసర ప్రాంత ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం మండల కార్యదర్శి రాక్యాల శ్రీశైలం,సిపిఐ మండల కార్యదర్శి అన్నెమైన వెంకటేష్,ఎస్ఎఫ్ఎ ఐ జిల్లా అధ్యక్షులు లావుడియా రాజు,మండల కార్యదర్శి ధరావత్ జగన్ నాయక్, నాయకులు పిట్టల శంకర్,రాజప్ప, దేవేందర్,రాకేష్, మోహన్, అవినాష్, శివ, బన్నీ జగన్, మణి కంఠ, సాయి తదితరులు పాల్గొన్నారు.