BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

రైతుల సమస్యలను తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బృందం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 02:53 PM
177 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బృందం రైతుల సమస్యలను పర్యటించి తెలుసుకుంది

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం, రేపూడి, పడమర, మాధవరం గ్రామాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత కిసాన్ మహాసభ బృందం మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించింది. ఈ పర్యటనలో డి. హరినాథ్ మాట్లాడుతూ, "రైతులు తమ ఉత్పత్తి చేసిన మొక్కజొన్నకు ఎకరాకు 70,000 రూపాయల పైగా పెట్టుబడులు పెట్టి, క్వింటాల్ 1600-1700 రూపాయల ధరలో అమ్మాలని చూస్తున్నారు. కానీ, దళారులు 1300-1400 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను మోసగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రకారం, క్వింటాల్ 2400 రూపాయల ధర ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది." "రైతుల వద్ద చెల్లింపు కోసం అధిక ధర పలకటమే కాకుండా, తడి శాతం లేనప్పటికీ 'తడి శాతం ఉంది' అని చెప్పి ధరను తగ్గించడం జరుగుతోంది. ఈ పరిస్థితి వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది," అని ఆయన అన్నారు. "ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రమే పర్యటించడం తప్ప, రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోడంలేదు. తక్షణమే ఏ కొండూరు మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే, రైతులు నిరసన ఆందోళన చేపడతారు," అని హరినాథ్ హెచ్చరించారు.