BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

రైతుల సమస్యలను తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బృందం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 02:53 PM
110 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బృందం రైతుల సమస్యలను పర్యటించి తెలుసుకుంది

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం, రేపూడి, పడమర, మాధవరం గ్రామాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అఖిల భారత కిసాన్ మహాసభ బృందం మొక్కజొన్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించింది. ఈ పర్యటనలో డి. హరినాథ్ మాట్లాడుతూ, "రైతులు తమ ఉత్పత్తి చేసిన మొక్కజొన్నకు ఎకరాకు 70,000 రూపాయల పైగా పెట్టుబడులు పెట్టి, క్వింటాల్ 1600-1700 రూపాయల ధరలో అమ్మాలని చూస్తున్నారు. కానీ, దళారులు 1300-1400 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ రైతులను మోసగిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రకారం, క్వింటాల్ 2400 రూపాయల ధర ప్రకటించినప్పటికీ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది." "రైతుల వద్ద చెల్లింపు కోసం అధిక ధర పలకటమే కాకుండా, తడి శాతం లేనప్పటికీ 'తడి శాతం ఉంది' అని చెప్పి ధరను తగ్గించడం జరుగుతోంది. ఈ పరిస్థితి వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది," అని ఆయన అన్నారు. "ప్రభుత్వ అధికార ప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రమే పర్యటించడం తప్ప, రైతుల సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోడంలేదు. తక్షణమే ఏ కొండూరు మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోతే, రైతులు నిరసన ఆందోళన చేపడతారు," అని హరినాథ్ హెచ్చరించారు.