BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఎనుగుమట్లలో కాంగ్రెస్ శ్రేణులను పరామర్శించిన మంత్రి

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
21 Mar, 2026 - 08:37 PM
72 వీక్షణలు

ఎనుగుమట్లలో కాంగ్రెస్ శ్రేణులను పరామర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఎనుగుమట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కుటుంబాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పరామర్శించారు.

​కుటుంబ సభ్యులకు ఓదార్పు:

కాంగ్రెస్ నాయకులు సురిగినేని రాజేశ్వరరావు మాతృమూర్తి చిన్నమ్మ ఇటీవల మరణించగా, మంత్రి వారి నివాసానికి వెళ్లి రాజేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

​అనంతరం, అదే గ్రామానికి చెందిన ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి, వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి ఓదార్చారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రి వెంట పలువురు మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.