మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసిన ఎండపల్లి మండల నాయకులు
NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్
కరీంనగర్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఎండపల్లి మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
గురువారం కరీంనగర్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసిన నాయకులు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ నూతన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై స్పందించాలని సూచించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎండపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube