BREAKING
ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో యు.జి. ఆనర్స్ 4 సెమిస్టర్ పరీక్షలు మంచిర్యాల మెడికల్ కాలేజీ విద్యార్థులపై స్థానిక యువకుల దాడి చింతలపూడి అన్న క్యాంటీన్ ప్రతిపాదన సిద్ధం చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశం టిడిపి యాప్ లో పుంగనూరు నియోజకవర్గ మొదటి స్థానం కైవసం చేసుకొన్న చెన్న కేశవ నాయుడు... ప్రకృతి వ్యవసాయ పంటలను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బడి తల్లి ఒడి ర్యాలీ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయ 15వ వార్షికోత్సవం​ మంత్రి ఆడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము ​జన్నారం మండలంలో విషాదం వ్యక్తి దుర్మరణం హుజురాబాద్ కు సమీపంలోని వెస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్ట్ ను వెంటనే రద్దు చేయాలి
www.ntodaynews.com

సుందరయ్య పార్క్‌లో త్రవ్వకాలు, గ్రీనరీ తొలగింపు ఆపాలి

తెలంగాణ
20 Nov, 2025 - 05:47 AM
191 వీక్షణలు
సుందరయ్య పార్క్‌లో త్రవ్వకాలు, గ్రీనరీ తొలగింపు ఆపాలి NTODAY NEWS: హైదరాబాద్ సుందరయ్య పార్కు లో గ్రీనరీని కాపాడాలని మరియు పార్క్‌లో త్రవ్వకాలు, గ్రీనరీ తొలగింపు ఆపించాలని, వాకర్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌, హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం HCF డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు (20.11.2025) సుందరయ్య పార్క్ లో తవ్వకాలు నిర్వహిస్తున్న దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ ఏవిపి సంపత్ రెడ్డి మాట్లాడుతూ సుందరయ్య పార్క్‌లో పది రోజుల నుండి పచ్చదనానిచ్చే గ్రీనరీని తొలగించి, పిల్లల ఆట వస్తువులు పెడతామన్న జిహెచ్‌ఎంసి అధికారుల చర్యలు ఆపాలని అన్నారు. సుందరమైన పార్క్‌ గ్రీనరీ తొలగింపుతో, సుందరయ్య పార్క్‌ రూపురేఖలు మారిపోతయాని అన్నారు. 2026 డిస్టిక్ గవర్నర్ శైలజ మోహన్ మాట్లాడుతూ పిల్లల ఆట వస్తువులను గతంలో ఉన్న పిల్లల ఆట స్థలంలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొంగల వల్ల ప్రతి సంవత్సరం పార్కు దెబ్బ తినకుండా కూడా తగిన ఏర్పాటు చేయాలని కోరారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా పార్కులో పిల్లల కోసం గతంలో ఉన్న పిల్లల ఆట స్థలంలోను, ఇతర స్థలాలలో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. హెచ్ సి ఎఫ్ ప్రధాన కార్యదర్శి వీరయ్య మాట్లాడుతూ నగరంలో ప్రతిష్టాత్మకమైనది సుందరయ్య పార్క్‌ అని, ఆహ్లాదానికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా ఉన్నదని అన్నారు. వాతావరణ మార్పులు, కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, రోగాల బారిన పడకుండా ఉండటానికి, శరీరానికి రోజూ ఎంతో కొంత నడక, వ్యాయామం అవసరం అన్నారు. సుందరయ్య పార్క్‌ చక్కటి వాతావరణాన్ని కల్పిస్తూ వాకర్స్‌ నడవడానికి వాకింగ్‌ ట్రాక్‌, స్వచ్చమైన గాలిని పీల్చుకోవడానికి పచ్చని చెట్లు ఉండడంతో రోజు 2000 మందికి పైగా వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి , దశరథ్, స్కైలాబ్ బాబు, రాజశేఖర్ , కుమార్, మాణిక్యం, హెచ్ సి ఎఫ్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వీరయ్య, నాయకులు పి నాగేశ్వరరావు, రమేష్, శంకరయ్య, నాగేష్, గోపాల్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube