www.ntodaynews.com
బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
తెలంగాణ
బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు
లారీని ఢీకొన్న కారు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి
పుంగనూరు: బెంగళూరు–చెన్నై జాతీయ రహదారి బైపాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు, ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా లారీ వెనుక భాగంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, సిమెంట్ లోడ్ను దించి నెల్లూరుకు తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇనోవా యారిస్ కారు తన లారీని బలంగా ఢీకొట్టిందని పోలీసులకు తెలిపాడు.
సమాచారం అందుకున్న గంగవరం, పలమనేరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఎక్స్కవేటర్ సహాయంతో లారీ వెనుక ఇరుక్కున్న కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం రాజాజీ నగర్కు చెందినవారిగా గుర్తించారు.
మృతుల వివరాలు
మోహన్ దాస్ (71)
నాగరాజరావు (61)
కుసుమ (61)
జయంతి (59)
పూజ (33)
ప్రమాదంపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి
గంగవరం మండలంలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
#RoadAccident #BangaloreChennaiHighway #Punganur #Gangavaram #AndhraPradeshNews #BreakingNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube