BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి తనిఖీలు

తెలంగాణ
13 Feb, 2026 - 03:48 AM
158 వీక్షణలు
మహాశివరాత్రి బందోబస్తు ఏర్పాట్లపై క్షేత్రస్థాయి తనిఖీలు NTODAY NEWS: శ్రీశైలం/ నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున్  నంద్యాల, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం క్షేత్రంలో భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో లడ్డూ కౌంటర్, శివాజీ గోపురం, అమ్మవారి ఆలయం, గుడి లోపలి ప్రదేశాలు, నాగుల కట్ట, చంద్రావతి కళ్యాణ మండపం, విఐపీ ప్రవేశ ద్వారం, హరిహరరాయ గోపురం తదితర ప్రాంతాలను సందర్శించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లను పరిశీలించి, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనే అంశంపై అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై, ఉత్సవాల కాలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో సమన్వయంతో పని చేసి, ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. #Nandyal #Srisailam #MahaShivaratri #PoliceBandobast #TempleSecurity #AndhraPradeshNews #FestivalArrangements Follow us on Website Facebook Instagram YouTube