www.ntodaynews.com
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
తెలంగాణ
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
తాటికొండ బుగ్గరాముడు చేతుల మీదుగా రూ.20 వేల నగదు అందజేత
నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం: బండిఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన షేక్ మాభు కుటుంబాన్ని టీడీపీ నాయకులు పరామర్శించారు.
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల సురేష్ రెడ్డి, బేడా బుడగజంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు నంద్యాల 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు మంత్రి N.Md.ఫరూక్ ఆదేశాల మేరకు రూ.20,000 నగదు ఆర్థిక సహాయం కంచర్ల సురేష్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా తాటికొండ బుగ్గరాముడు మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 10 బర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 బర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని తెలిపారు. గాయపడిన పశువులకు వైద్య చికిత్స అందించేందుకు ఈ ఆర్థిక సహాయం అందజేసినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Nandyal #SrisailamConstituency #TDP #TatkondaBuggaramudu #FireAccident #HelpingHands
Follow us on
Website
Facebook
Instagram
YouTube