www.ntodaynews.com
జాయ్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్
తెలంగాణ
ఏలూరులో జాయ్ ప్లే స్కూల్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్
NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్
ఏలూరు నగరంలోని శనివారపు పేట, కట్టా సుబ్బారావు తోటలో ఉన్న జాయ్ ప్లే స్కూల్లో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు.
బిర్యానీ, కేక్స్, చికెన్ వంటకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు చెఫ్ల వేషధారణలో పాల్గొని సందర్శకులను ఆకట్టుకున్నారు. ఆహార వ్యర్థాలను నివారించాల్సిన అవసరంపై అవగాహన కల్పిస్తూ, మిగిలిన ఆహారాన్ని సద్వినియోగం చేసుకునే మార్గాలను వివరించారు.
కార్యక్రమం సందర్భంగా లీలాస్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా 150 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు, అనాథ పిల్లలకు పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ రమేష్, ప్రిన్సిపల్ సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
#Eluru #FoodFestival #JoyPlaySchool #StudentActivities #FoodAwareness #CommunityService #AndhraPradeshNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube