గాలివాన బీభత్సానికి చిట్యాల అతలాకుతలం
జాతీయ రహదారిపై విరిగిపడ్డ చెట్లు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ లో ప్రకృతి వైపరీత్యం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలుల బీభత్సానికి చింతపల్లి నరేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా బలమైన గాలుల ధాటికి ఇంటి పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపోవడంతో, ఇంట్లో ఉన్న సామాగ్రి, నిత్యావసర వస్తువులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పళ్ళు చోట్ల గాలి వానకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు తీవ్రత అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై చెట్లు విరగడంతో 19 రాహుల్ ఇబ్బందులు ఎదురయ్యాయి ఘటన గురించి సమాచారం అందిన వెంటనే రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజయ్ స్పందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులతో కలిసి ఆమె ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని పరిశీలించారు. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. తమ వంతుగా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.