BREAKING
SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్
www.ntodaynews.com

గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Jun, 2026 - 03:32 PM
20 వీక్షణలు

సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధే ధ్యేయం

- సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి 

మరిపెడ మండలం గాలివారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గ్రామస్తులు, వివిధశాఖలఅధికారులు,ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో గాలివారిగూడెంను అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.గ్రామ సభలో పాల్గొన్న వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉష మాట్లాడుతూ గర్భిణులు,బాలింతలు, చిన్నారులు పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రక్తహీనత,పోషకాహార లోపాలను నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న మౌలిక వసతుల కల్పన,అభివృద్ధి పనుల పురోగతిని ఏఈ ప్రజలకు వివరించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి,అంగన్‌వాడీ సిబ్బంది,ఆశా కార్యకర్తలు,గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.