BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్

తెలంగాణ
26 Feb, 2026 - 08:11 PM
268 వీక్షణలు
కామారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర ట్రాన్స్‌ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్ NTODAY NEWS: కామారెడ్డి 50కి పైగా చోరీల గుట్టురట్టు కామారెడ్డి, ఫిబ్రవరి 26: వ్యవసాయ భూముల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్, ఆయిల్ దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది కాలంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన మద్నూర్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. కేసు వివరాలు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 8, 2026న పెద్దఎక్లార గ్రామ సమీపంలోని పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ దొంగిలించిన ఘటనపై గ్రామ పంచాయతీ అధికారి మన్నే సంతోష్ మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. ముఠా నేపథ్యం ముఠాలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. గతంలో నిజామాబాద్ జైలులో ఉన్న సమయంలో పరిచయం ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడ్డారు. నేరాల తీరు మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, పిట్లం, బిచ్కుంద పోలీస్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూములే ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు సుమారు 50కి పైగా ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్, ఆయిల్ దొంగిలించినట్లు నిందితులు అంగీకరించారు. పగటిపూట రేకీ నిర్వహించి సమాచారం సేకరించి, రాత్రివేళ మారణాయుధాలతో దాడులకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. పోలీసుల హెచ్చరిక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. #Kamareddy #TransformerTheft #InterstateGang #TelanganaPolice #CrimeNews Follow us on Website Facebook Instagram YouTube