గొడిసెలపేట కోదండ రామాలయ నిర్మాణానికి భారీ విరాళం
గొడిసెలపేట కోదండ రామాలయ నిర్మాణానికి భారీ విరాళం: 100 సిమెంట్ బస్తాలు, రూ. 2 లక్షల ఆర్థిక సాయం మద్దుల గోపాల్ రెడ్డి
కరీంనగర్
గొడిసెలపేట గ్రామంలో నిర్మిస్తున్న కోదండ రామాలయానికి మాజీ సింగిల్ విండో ఛైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. గొడిసెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేష్ నాయకత్వంలోని ఆలయ కమిటీ సభ్యులు కరీంనగర్లోని గోపాల్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల వివరాలను కమిటీ సభ్యులు వివరించారు. భగవత్ కార్యంలో తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో గోపాల్ రెడ్డి ఆలయ నిర్మాణానికి 100 సిమెంట్ బస్తాలను అందజేశారు. అలాగే నిర్మాణానంతరం జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల కోసం రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయలు) నగదును విరాళంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో కోదండ రామాలయ కమిటీ ఛైర్మన్ చిలువేరి వెంకటేష్, కోశాధికారి బద్రి చంద్రయ్య, కార్యదర్శి గర్శకుర్తి దిలీప్, ఉపసర్పంచ్ గోపు భాగ్య కేశవ్, గోపు రాకేష్ మరియు హనుమాన్ దీక్షా స్వాములు పాల్గొన్నారు.