www.ntodaynews.com
గోదావరి పుష్కరఘాట్ను పరిశీలించిన అధికారులు
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
గోదావరి పుష్కరఘాట్ను పరిశీలించిన అధికారులు
మంచిర్యాల పట్టణంలోని గోదావరి పుష్కరఘాట్ ప్రాంతాన్ని ఆర్ అండ్ బి (R&B) చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ మరియు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వారు చర్చించారు. ముఖ్యంగా పుష్కర ఘాట్కు వెళ్లే రహదారుల మరమ్మతులు, భక్తుల కోసం కనీస వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన నిధుల కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు