BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

గోమాతకు రాష్ట్ర మాత గౌరవం దక్కాలి

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
27 Apr, 2026 - 08:37 PM
21 వీక్షణలు

గోమాతకు 'రాష్ట్ర మాత' గౌరవం దక్కాలి: దొంకేశ్వర్‌లో గోసేవకుల విన్నపం..

ఏంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేత..

దొంకేశ్వర్, ఏప్రిల్ 27:

భారతీయ సంస్కృతికి వెన్నెముక అయిన గోమాతను అధికారికంగా "రాష్ట్ర మాత" (Mother of the Nation) గా గుర్తించాలని డిమాండ్ చేస్తూ దొంకేశ్వర్ మండల కేంద్రంలో 'గో ఆరాధన ఉద్యమం' హోరెత్తింది. సాధు సంతుల మార్గదర్శకత్వంలో మండల కమిటీ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గోరక్షకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సురేందర్ గారి నేతృత్వంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ, హిందూ ధర్మంలో గోవును కేవలం జంతువుగా కాకుండా సాక్షాత్తు అమ్మగా భావించి పూజిస్తామని గుర్తుచేశారు. తరతరాలుగా మన జీవన గమనంలో అంతర్భాగమైన గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో గోసంపద తగ్గిపోతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, గోవధను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు.

మండలవ్యాప్తంగా సేకరించిన సంతకాలతో కూడిన మెమోరాండంను తహశీల్దార్‌కు అందజేస్తూ, దీనిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. గోవును 'రాష్ట్ర మాత'గా ప్రకటించడం ద్వారానే మన సంస్కృతికి నిజమైన గౌరవం దక్కుతుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, గోరక్షకులు, గోసేవకులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.