గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు, విజ్ఞాన భాండాగారాలు: మోరంపూడి శ్రీనివాసరావు
నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు శనివారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని చనుబండ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
క్రమార్ధంగా, అతిథులు, గ్రంథాలయాధికారి కేకు కట్ చేసి పిల్లలకు పంచారు. శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు బిస్కట్లు అందజేయడం జరిగింది. ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి బహుమతి మరియు ప్రశంసా పత్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, "నాలెడ్జే పవర్" అని, పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతుందని, దానికి గ్రంథాలయాలను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అతిథులు కందుల కృష్ణ, చీదిరాల మారేశ్వర రావు, నక్కా రాము, బజ్జూరి గోపి కూడా గ్రంథాలయాల ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి శ్రీకాంత్, సిబ్బంది త్రివేణి, షేక్ రియాజ్, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.