www.ntodaynews.com
గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
గుండ్రాంపల్లి
NTODAY NEWS
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన
కొబ్బరిబోండాల లోడ్తో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక డీసీఎం వాహనాన్ని, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు డీసీఎం వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో సదరు వాహనాలు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, క్షతగాత్రుల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.