BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

గుండు చేయించుకుంటే డబ్బులు అంటూ మోసం! ముగ్గురు మహిళలను బురిడీ కొట్టించిన ఆకతాయిలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 02:52 PM
36 వీక్షణలు

సేలం జిల్లాలో విచిత్ర ఘటన.. ఫోన్ కాల్ నమ్మి గుండు చేయించుకున్న బాధితులు

తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి ప్రాంతంలో అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు విచిత్రమైన మోసానికి పాల్పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన ఓ అజ్ఞాత వ్యక్తి, త్వరలో కరోనా తరహా కొత్త వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని మహిళలను భయపెట్టాడు.

విదేశాల్లో ఆ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేస్తోందని నమ్మించాడు. ప్రభుత్వం ప్రత్యేక పథకం కింద గుండు చేయించుకున్న మహిళలకు రూ.15 వేల ఆర్థిక సాయం, కళాశాల విద్యార్థినులకు రూ.45 వేలతో పాటు ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకు రూ.6 వేల నగదు అందిస్తామని చెప్పాడు. ఇప్పటికే జాబితాలో మీ పేరు ఉందంటూ ఓ మహిళను నమ్మించాడు.

ఆ మహిళ ఈ విషయాన్ని గ్రామంలోని ఇతర మహిళలకు చెప్పడంతో ముగ్గురు మహిళలు నిజమేనని భావించి గుండు చేయించుకున్నారు. అనంతరం చెప్పిన నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తాము మోసపోయినట్లు గ్రహించారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను గుడ్డిగా నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలపై సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.