BREAKING
ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రజా సమస్యల పరిష్కారానికి 'వేదిక', న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి
www.ntodaynews.com

న్యాయం కోసం కలెక్టరేట్‌కు వచ్చి పురుగుల మందు తాగిన యువతి.. గుంటూరులో కలకలం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
08 Jun, 2026 - 03:30 PM
13 వీక్షణలు

గుంటూరు కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 'నాని' అనే యువతి తన కుటుంబ సభ్యుల వేధింపులను తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

బాధిత యువతి ఆరోపణల ప్రకారం, తన తండ్రి, బాబాయ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు తనను, తన తల్లిని వేధిస్తున్నారని తెలిపింది. తన తండ్రికి రెండో వివాహం జరిపించి, తన తల్లి వద్ద నుంచి 15 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదును తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ విషయంపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని, సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో కలెక్టరేట్‌లోనే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఘటనను గమనించిన అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి చేసిన ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.