www.ntodaynews.com
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ మృతి..
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ మృతి..
పెద్దపంజాణి మండలం రాజుపల్లి గ్రామ మలుపు వద్ద రాత్రి ఓ ఆటో ప్యాసెంజర్ లతో వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది.
కర్ణాటక నుంచి పుంగనూరుకు వస్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సాద్ (22) అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.