ఘనంగా 31వ రోజు ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ
మంచిర్యాల పట్టణంలో పేదలు, బాటసారుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా సాగుతున్న ‘దివాకరన్న పెరుగన్నం’ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా 31వ రోజుకు చేరుకుంది. ఆదివారం మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజలకు పెరుగన్నాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో కార్పొరేటర్లు పెట్టేం సునీతా-లక్ష్మణ్, అబ్దుల్ సత్తార్ లతో పాటు ప్రముఖ నాయకులు తోట తిరుపతి, గోగుల రవీందర్ రెడ్డి, ఒడ్నాల రవీందర్, జాడి భాను చందర్, పుప్పాల స్వర్ణకార్, బల్లికొండ రమేష్, మంతెన గట్టయ్య, నక్క తిరుపతి, రామగిరి శ్రీకాంత్, బక్క మనోహర్, కొమ్ము ప్రవీణ్, గొడుగు పవన్, సుర్లా రాము తదితరులు ఉన్నారు.
నెల రోజులుగా నిర్విరామంగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు, బాటసారులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు