BREAKING
SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ SIR మ్యాపింగ్‌పై అపోహలు తొలగించాలి గాలివారిగూడెంలో ఘనంగా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత. రక్త పరీక్షలకు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి చిలకలూరిపేట మోటార్ వర్కర్స్ దశాబ్దాల కల ఏపీ పీసెట్ ఎగ్జామినర్ గా చిలకలూరిపేటకు చెందిన ప్రవీణ్ నియామకం వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చినమల్లయ్య గణపవరం లో అర్ధరాత్రి డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్
www.ntodaynews.com

​ఘనంగా ముగిసిన ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
06 Jun, 2026 - 03:27 PM
117 వీక్షణలు

41 రోజుల పాటు ప్రజల దాహార్తిని తీర్చిన కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

​మంచిర్యాల నియోజకవర్గంలో వేసవి కాలాన్ని పురస్కరించుకుని కీ.శే. శ్రీ కొక్కిరాల రఘుపతి రావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో... మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలీవాడ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీలతో పాటు లక్షెట్టిపేట టౌన్‌లోని ఉత్కూర్ చౌరస్తా వంటి ప్రధాన కూడళ్లలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాలను విజయవంతంగా నిర్వహించారు.

​ఈ ముగింపు సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ గారలు మాట్లాడుతూ... మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో 41 రోజులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో 37 రోజుల పాటు నిరంతరాయంగా అంబలి పంపిణీ చేసి ప్రజలకు అండగా నిలిచామని, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సేవకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారితో పాటు పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో, సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు