ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు మృతి NTODAY NEWS నల్గొండ
నల్గొండ జిల్లాలోని గుర్రంపోడు మండలం వద్దిరెడ్డిగూడెం శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అతివేగంగా వచ్చిన కియా సెల్టోస్ కారు ఓ బైక్ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులతో పాటు కారులో ఉన్న ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు డ్రైవర్ జైపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసిన గుర్రంపోడు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ ప్రమాదంతో నల్లగొండ-దేవరకొండ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.