www.ntodaynews.com
మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్
తెలంగాణ
శ్రీ మహాలక్ష్మీదేవి అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్
NTODAY NEWS: ఎన్టీఆర్ జిల్లా
దసరా శరన్నవరాత్రులలో అయిదో రోజు శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ కు, గవర్నర్ కార్యాలయ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి డా. ఎం.హరి జవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో శీనా నాయక్ , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తదితరులు స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి, వేదాశీర్వచనం చేశారు. గవర్నర్ కు అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube