BREAKING
​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ సర్కార్‌తోనే పేదల సొంతింటి కల సాకారం ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన కల్పించిన కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బండారుపల్లి జగన్నాధరావుకు ప్రత్తిపాటి పుల్లారావు తరపున ఘన నివాళి. చెగ్యాంలో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పుంగనూరు మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్ సర్కార్‌తోనే పేదల సొంతింటి కల సాకారం
www.ntodaynews.com

హార్స్లీ హిల్స్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
31 May, 2026 - 07:43 PM
12 వీక్షణలు
ప్రత్యేక తనిఖీల్లో భారీగా జరిమానాలు – వాహనాల సీజ్
ప్రజల ప్రాణ భద్రతతో చెలగాటం ఆడితే ఉపేక్షించం

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హెచ్చరిక

మదనపల్లె,  ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
హార్స్లీ హిల్స్ ఘాట్ రోడ్డులో కొందరు యువకులు అతివేగంగా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడపడం, ఒకే బైక్‌పై ముగ్గురు, నలుగురు ప్రయాణించడం, మోడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం సృష్టించడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి చర్యలతో తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించగా, కేవలం రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేసి రూ.52 వేల జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 13 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటు పలువాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి చట్టబద్ధ పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
హార్స్లీ హిల్స్‌లో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇకపై నిరంతరాయంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.
పర్యాటకులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు.
"నిబంధనలు పాటించడం బాధ్యత... ఉల్లంఘించడం ప్రమాదం. హార్స్లీ హిల్స్‌లో నిర్లక్ష్య డ్రైవింగ్‌ను ఏమాత్రం సహించం" అని కలెక్టర్ స్పష్టం చేశారు.