BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

హైడ్రా పనులు ఆగవు.. అధికారిని నియమించే హక్కు ప్రభుత్వానిదే: సీఎం రేవంత్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:24 AM
13 వీక్షణలు

హైడ్రా పనులు ఆగవు.. అధికారిని నియమించే హక్కు ప్రభుత్వానిదే: సీఎం రేవంత్

ఢిల్లీ: హైడ్రా పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రా వద్దంటున్నది కబ్జాదారులేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే వారు ఎంత పెద్దవారైనా, పేదవారైనా ఉపేక్షించబోమన్నారు.

గండిపేట బతుకమ్మ కుంటలు, ఎన్ కన్వెన్షన్ వంటి ఆక్రమణలను ప్రస్తావిస్తూ, అవి పేదలవా? పెద్దలవా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. హైడ్రా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలక సంస్కరణ అని పేర్కొన్నారు.

హైడ్రాకు ఉన్నతాధికారిగా ఎవరిని నియమించాలనే నిర్ణయం ప్రభుత్వ విచక్షణాధికారమని సీఎం స్పష్టం చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్‌పై 400కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.

హైడ్రాపై సామాజిక మాధ్యమాల్లో డబ్బులు వెచ్చించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన సీఎం, కబ్జాదారులకు మీడియా సహకరించవద్దని సూచించారు.

విద్యా వ్యవస్థపై మాట్లాడుతూ, ఆఫ్‌లైన్ పరీక్షల నిర్వహణ వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. విద్య అంశంలో రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టామని వివరించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అదనంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్త పనులను చేర్చి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, లోతుకుంట భూముల కేసు విచారణలో హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పాటించలేదని పేర్కొంటూ ఆయనను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, అర్హత కలిగిన అధికారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.