ఘనంగా నో బాగ్ డే,ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక వేషధారణలు
NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు
శ్రీ సత్యసాయి జిల్లా, అమడగూరు మండలం ఏ. రెడ్డివారిపల్లి లోని ప్రాథమిక పాటశాల ఉపాద్యాయులు రోజా శనివారం నాడు నో బాగ్ డే ను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రోజా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి శనివారం పిల్లలు మానసిక ఉత్సాహం మరియు విద్యార్థుల తల్లిదండ్రులను వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా చేయడానికి నో బాగ్ డే ను జరుపుకోవాలని ఆదేశానుసారం శనివారం విద్యార్థులకు శ్రీ రాముడు, సరస్వతి దేవి, రైతు, దుర్గ దేవి, మీరాబాయి, శ్రీకృష్ణుడు, గోపికలు, షిర్డీ సాయిబాబా, అల్లూరి సీతారామరాజు, ఆంజనేయ స్వామి, డాక్టర్, పోలీస్, భీముడు, ఉపాధ్యాయురాలు ఇలా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో వివిధ సాంస్కృతిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. అదే విధంగా ఈ వేషధారణలో భాగంగా బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి పేట.గగన్ (శ్రీ రాముడు), రెండవ బహుమతి నేహా సాయి ప్రీతి (దుర్గాదేవి) మూడవ బహుమతి నిత్య (సరస్వతి దేవి) మరియు వివిధ వేశదరణలు వేసిన ప్రతి విద్యార్థికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రోజా, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube