BREAKING
ఎస్పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్(SB)సిఐ బండారు సురేష్ పై వేటు... కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ ఎస్పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్(SB)సిఐ బండారు సురేష్ పై వేటు... కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ
www.ntodaynews.com

హరీష్‌రావుపై కేటీఆర్‌కు భయమా..? బీఆర్‌ఎస్‌లో నాయకత్వ పోరు మొదలైందన్న అద్దంకి దయాకర్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 06:27 AM
16 వీక్షణలు

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్‌రావు రాజకీయంగా బలమైన నాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆయనతో ప్రమాదం ఉందనే భావనతో కేటీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. సీఎల్పీ మీడియా హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్‌ఎస్ అంతర్గత పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్‌ఎస్‌లో నాయకత్వ సంక్షోభం నెలకొందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాజీనామా చేయాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. పదవుల కోసం త్యాగాలు చేశానని చెప్పే కేసీఆర్, ఇప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, భవిష్యత్తు లేని నాయకులకే ఫ్యూచర్ సిటీపై భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టాప్-100 కంపెనీలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంపై కేటీఆర్‌కు పూర్తి అవగాహన లేదని, అవసరమైతే ప్రత్యేకంగా క్లాస్ చెబుతామని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ నాయకత్వంపై సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదని, ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని అన్నారు.

ప్రతిపక్షాలు రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలని, అలాంటి రాజకీయాలతో లబ్ధి పొందాలని ప్రయత్నించవద్దని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.